విడాకులకు అప్లై చేసుకున్న 'ఐశ్వర్యా రాయ్‌' దంపతులు

విడాకులకు అప్లై చేసుకున్న ఐశ్వర్యా రాయ్‌ దంపతులు
x
Highlights

అంగరంగ వైభవంగా ఈ ఏడాదే వివాహం చేసుకున్నపొలిటికల్ జంట విడిపోనుందా..? రాజకీయంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగిందా..? అంటే అంటుననే సమాధానం...

అంగరంగ వైభవంగా ఈ ఏడాదే వివాహం చేసుకున్నపొలిటికల్ జంట విడిపోనుందా..? రాజకీయంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగిందా..? అంటే అంటుననే సమాధానం వినిపిస్తోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు.. మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యా రాయ్‌ దంపతులు విడాకులు కావాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భార్య ఐశ్వర్యా రాయ్‌తో తనకు విడాకులు మంజూరు చేయాలని శుక్రవారం తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. కాగా తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యా రాయ్‌ ల వివాహం ఈ ఏడాది మే 12న అతిరధమహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె ఆర్జేడీ సీనియర్ నేత చంద్రికా రాయ్ కుమార్తె. గతకొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం పెరిగినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories