రైల్వే ట్రాక్‌పై ఎమ్మెల్యే తనయుడి మృతదేహం

రైల్వే ట్రాక్‌పై ఎమ్మెల్యే తనయుడి మృతదేహం
x
Highlights

నలందా మెడికల్‌ కాలేజీ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభించడంతో కలకలం రేగింది. ఈ ఘటన పట్నా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం...

నలందా మెడికల్‌ కాలేజీ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభించడంతో కలకలం రేగింది. ఈ ఘటన పట్నా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో మృత దేహాన్ని గుర్తించారు. చనిపోయింది జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి కుమారుడు దీపక్‌గా తేల్చారు. ఆయన మృతికి కారణాలేమిటో తెలియడం లేదు. దర్యాప్తు జరుగుతోంది. ఇదిలావుండగా దీపక్‌ హత్యకు గురయ్యాడని బీమా భారతి, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీపక్ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తాను తన స్నేహితుడు ఇస్తున్న పార్టీకి వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపారు. ముసల్లాపూర్ హాత్ ఏరియాకు వెళ్తున్నట్లు చెప్పిన దీపక్ మృతదేహం నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కనిపించడంపై అనుమానం వ్యక్తం చేశారు. బీమా భారతి భర్త అవధేశ్ మండల్ కండలవీరుడు. ‘బాహుబలి’ రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనపై నిషేధం అమలవుతోంది. అందుకే ఆమె ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories