నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ...

నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ...
x
Highlights

టీఆర్ఎస్ తమ అభ్యర్థులను రెండు నెలల క్రితం ప్రకటిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు....

టీఆర్ఎస్ తమ అభ్యర్థులను రెండు నెలల క్రితం ప్రకటిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిన్న అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర రచ్చరచ్చ జరుగుతోందనీ, టికెట్లు రాని అభ్యర్థులు అక్కడే వంటావార్పు చేసుకుని ధర్నాలకు దిగుతున్నారని వెల్లడించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ముందు సెలైన్లు పెట్టుకుని మరీ ఆందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పత్రికల్లో ఫొటోలు చూస్తుంటే నాంపల్లి దగ్గర ఉన్నది గాంధీ భవనా? లేదా గాంధీ ఆసుపత్రా? అన్న అనుమానం కలుగుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories