పంద్రాగస్టు రోజే కేజ్రీవాల్‌కు ఊహించని షాక్!

పంద్రాగస్టు రోజే కేజ్రీవాల్‌కు ఊహించని షాక్!
x
Highlights

ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కి దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ...

ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కి దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ జర్నలిస్ట్‌ అశుతోష్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వ్యక్తిగత కారణాలతోనే’’ తాను పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇవాళ ట్విటర్ వేదికగా అశుతోష్ స్పందిస్తూ.. ‘‘ప్రతి ప్రయాణానికీ ఓ ముగింపు ఉంటుంది. ఆప్‌తో నా అందమైన, విప్లవాత్మక అనుబంధం కూడా ముగిసింది. నేను పార్టీకి రాజీనామా చేశాను. దీనిని ఆమోదించాల్సిందిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని కోరాను. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. పార్టీలో ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు...’’ అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories