సంచలన నిర్ణయం : వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరణ..

సంచలన నిర్ణయం : వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరణ..
x
Highlights

మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ జనరల్‌ సెక్రెటరీగా ఉన్న కె.శివకుమార్‌ను పార్టీ...

మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ జనరల్‌ సెక్రెటరీగా ఉన్న కె.శివకుమార్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 'తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ లెటర్‌ హెడ్‌ ఉపయోగించి ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా శివకుమార్‌ ఇచ్చిన ప్రకటనను తీవ్ర క్రమశిక్షణ రాహిత్యంగా భావించాం, ఈ విషయమై క్రమశిక్షణా సంఘం సభ్యులు అత్యవసరంగా చర్చించి ఆయన్ను శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు' అంటూ పేర్కొంది. అలాగే తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుగా శివకుమారే ప్రారంభించారు. ఆ తరువాత జగన్ ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories