3వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన జగన్‌ పాదయాత్ర

3వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన జగన్‌ పాదయాత్ర
x
Highlights

ప్రజాసమస్యలను అధ్యయనం చేస్తూ, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో అరుదైన మైలురాయిని దాటింది. జగన్‌...

ప్రజాసమస్యలను అధ్యయనం చేస్తూ, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో అరుదైన మైలురాయిని దాటింది. జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెంలో రావి మొక్క నాటిన జగన్‌ మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పైలాన్‌ ఆశిష్కరించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories