ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు..

ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు..
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించి, మరొరికితో పెళ్లికి ఒప్పుకుందని లహరి అనే...

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించి, మరొరికితో పెళ్లికి ఒప్పుకుందని లహరి అనే యువతిని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ పై తాను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాపూజీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమ పేరుతో కిరణ్‌ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతులు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories