లాఠీచార్జ్‌లో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్త మృతి

లాఠీచార్జ్‌లో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్త మృతి
x
Highlights

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో నిన్న లాఠీచార్జ్‌లో గాయపడిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త చందూనాయక్‌ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతడిని...

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో నిన్న లాఠీచార్జ్‌లో గాయపడిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త చందూనాయక్‌ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతడిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చందూనాయర్ ఇవాళ మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మన్ననూరు గ్రామంలోని 218, 219 పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో చందూనాయక్ తీవ్రంగా గాయపడ్డాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories