పార్టీ మారే పరిస్థితి లేదు : జగ్గారెడ్డి

పార్టీ మారే పరిస్థితి లేదు : జగ్గారెడ్డి
x
Highlights

ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే పరిస్థితి లేదన్నారు సంగారెడ్డి ఎ‌మ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. ప్రభుత్వం, రాబోయే మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని...

ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే పరిస్థితి లేదన్నారు సంగారెడ్డి ఎ‌మ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. ప్రభుత్వం, రాబోయే మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. నాలుగేళ్లు ఎలాంటి రాజకీయ విమర్శలు చేయనని చెప్పారు. ప్రజల పక్షాన రాజకీయాల జోలికి పోకుండా సేవ చేస్తానన్నారు జగ్గారెడ్డి. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌ను అవసరమైతే యాభైసార్లు కలుస్తానని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.1.50 లక్షలకు పెంచాలనీ, పెళ్లికి నెలముందే చెక్కు అందించాలని కోరతానన్నారు. గతంలో తెలిసీ తెలియక ఒకట్రెండు తప్పులు చేశానని, ఇకపై ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పని చేస్తానన్నారు. సంగారెడ్డి జిల్లాకు కొత్తగా ఎవరు మంత్రిగా వచ్చినా వారి సూచనల మేరకు నడుచుకుంటానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories