కేసీఆర్‌పై 50వేల మెజార్టీతో గెలవబోతున్నా: వంటేరు

కేసీఆర్‌పై 50వేల మెజార్టీతో గెలవబోతున్నా: వంటేరు
x
Highlights

ఎన్నికల రణక్షేత్రంలో మహాయుద్దన్నే తలపించే విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే ఎగ్జిట్ పోల్స్ స్వరేలు కూడా...

ఎన్నికల రణక్షేత్రంలో మహాయుద్దన్నే తలపించే విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే ఎగ్జిట్ పోల్స్ స్వరేలు కూడా వెల్లడించాయి. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్‌లో హోరాహోరి పోటీనే తలపించింది. ఇటు సొంత నియోజకవర్గంలో కెసిఆర్‌కు పోటీగా వంటేరు ప్రతాప్‌రెడ్డి నిలబడిన విషయం తెలిసిందే. కాగా గజ్వేల్ లో కెసిఆర్ పై 50వేల మేజార్టీతో తాను గెలవబోతున్నానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని చంపేశారని విమర్శల వర్షం కురిపించారు. అసలు నిజమైన స్వాతంత్ర్యం ఈనెల 11తేదిన వస్తుందని అన్నారు. గడిచిన నాలుగేండ్లలో ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇటు తెలంగాణను సర్వనాశనం చేశారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories