రేపిస్టుకు గ్రామ శిక్ష…దున్నపోతుపై ఊరేగించారు...

రేపిస్టుకు గ్రామ శిక్ష…దున్నపోతుపై ఊరేగించారు...
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారం చేసిన వ్యక్తికి దేహాశుద్ధి చేశారు స్థానికులు. నిందితుడి ముఖానికి నల్ల రంగు పూసి, అతన్ని దున్నపోతుపై ఊరేగించారు. అతని మెడలో...

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారం చేసిన వ్యక్తికి దేహాశుద్ధి చేశారు స్థానికులు. నిందితుడి ముఖానికి నల్ల రంగు పూసి, అతన్ని దున్నపోతుపై ఊరేగించారు. అతని మెడలో షూలతో చేసిన దండను వేసి చాలా హేయంగా శిక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 8 ఏళ్ళ బాలుడికి మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. సదరు బాధిత బాలుడు ఇంటికి వచ్చి అమ్మానాన్నలతో జరిగిన ఉదంతం గురించి చెప్పాడు. వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండా గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు. అప్పుడు వాళ్ళు పంచాయితీ పెట్టి నిందితుడికి శిక్ష అమలు చేశారు. నిందితుడి ముఖానికి నల్ల రంగు పూసి, అతణ్ణి దున్నపోతుపై ఊరేగించారు. అతని మెడలో చెప్పులతో చేసిన దండను వేసి మరీ ఊరేగించారు. ఇకపై గ్రామంలో ఎవరూ ఇలాంటి పాడుపనులకు పాల్పడవద్దని హెచ్చరిస్తూ ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories