ఇండియన్ ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ వీడియో వైరల్‌

x
Highlights

2016లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సంబంధించిన వీడియో బయటికొచ్చింది....

2016లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సంబంధించిన వీడియో బయటికొచ్చింది. తీవ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపుతూ 2016 సెప్టెంబర్‌లో చేపట్టిన ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. ఉడీ ఘటనకు ప్రతీకారంగా పీవోకే లక్ష్యంగా భారత ఆర్మీ ఈ దాడులు నిర్వహించింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు దాదాపు ఏడాదిన్నర తర్వాత బయటికి వచ్చాయి. నాలుగు ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ఏవిధంగా భూస్థాపితం చేసిందో ఈ వీడియోలో క్లియర్‌గా కనబడుతోంది.

ఉగ్ర స్థావరాలపై ఇండియన్‌ ఆర్మీ జరిపిన మెరుపు దాడులకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన తర్వాత అవి ఎలా జరిగాయో తెలుసుకోవడానికే సైనికులు ఈ‎ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దాదాపు 5గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఏడు ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 38మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలు నిజమైనవేనని ఆనాడు సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఇన్‌‍ఛార్జ్‌గా ఉన్న రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories