పాపం.. బతికుండగానే చంపేశారు

పాపం.. బతికుండగానే చంపేశారు
x
Highlights

సెలెబ్రిటీలు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే చాలు. వారి చివరి ఘడియల కోసం ఎదురుచూసేవాళ్ల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఆ మధ్య సత్యనారాయణ అన్న నటుడు...

సెలెబ్రిటీలు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే చాలు. వారి చివరి ఘడియల కోసం ఎదురుచూసేవాళ్ల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఆ మధ్య సత్యనారాయణ అన్న నటుడు చనిపోయారని తెలియగానే.. కొన్ని చానళ్లలో కైకాల సత్యనారాయణ ఇక లేరు.. అంటూ వార్తలొచ్చేశాయి. అంతకుముందు.. ఇలానే చాలామంది సెలెబ్రిటీల విషయంలో ఇలాగే జరిగింది. తర్వాత.. నేను బానే ఉన్నా.. అంటూ సదరు సెలెబ్రిటీలే స్వయంగా వివరించాల్సి వచ్చింది.

ఇప్పుడు అలాంటి జాబితాలో కన్నడ నటి.. తెలుగు వారికీ సుపరిచితురాలైన జయంతి కూడా చేరిపోయారు. ఆమె అనారోగ్యంతో ఉన్నారన్న మాట నిజమే. కానీ.. ఇప్పటికిప్పుడు ఆమెకు వచ్చిన ముప్పేమీ లేదు. అయినా కూడా.. ఏదో వదంతులను నమ్ముతూ.. జయంతి ఇక లేరు.. అంటూ కొన్ని చానళ్లు ఆమెను బతికుండగానే చంపేశాయి. పాపం.. హాస్పిటల్ లో ఉన్నారు కాబట్టి.. జయంతికి ఇంకా ఈ విషయం తెలియలేదు కానీ.. బయట ఉండి ఉంటే చాలా ఆవేదనకు గురయ్యేవారు.

ఈ విషయంపై.. జయంతి కుమారుడు కృష్ణకుమార్ స్పందించారు. ఆస్తమాతో తన తల్లి బాధపడుతున్నారని.. బెంగళూరులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి కంటే కూడా.. ఇవాళ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని.. త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం కూడా ఉందని చెప్పారు. వదంతులు వ్యాపింపచేయవద్దని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories