ప్రజా కూటమి అధికారం చేపడుతుంది : ఉత్తమ్

ప్రజా కూటమి అధికారం చేపడుతుంది : ఉత్తమ్
x
Highlights

నిన్న(శుక్రవారం) తెలంగాణలో పోలింగ్ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. దాడి అనంతరం వంశీ.. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స...

నిన్న(శుక్రవారం) తెలంగాణలో పోలింగ్ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. దాడి అనంతరం వంశీ.. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంశీని పరామర్శించారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక ఇలా భౌతిక దాడులకు దిగారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు జరగడం శోచనీయం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ్.. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజకూటమి అధికారంలోకి రాబోతుంది.. ప్రజకూటమి అత్యధిక సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపడుతుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు మా ధన్యవాదాలు అని ఆయన అన్నారు. అలాగే నేషనల్ మీడియా ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడిన ఉత్తమ్.. అవి కరెక్ట్ కాకపోవచ్చు అని తమతోనే వారున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories