పవన్ తో పెరిగిన దూరం పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు !

పవన్ తో పెరిగిన దూరం పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు !
x
Highlights

అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తర్వాత పవన్‌కల్యాణ్‌తో విభేదాలు వచ్చాయన్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఒక ప్రముఖ తెలుగు...

అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తర్వాత పవన్‌కల్యాణ్‌తో విభేదాలు వచ్చాయన్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ‘అజ్ఞాతవాసి’ తరువాత తమ మధ్య దూరం పెరిగింది అని వస్తున్న వార్తల పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన దర్శకుడుని కౌగలించుకుని ముద్దులు పెట్టి ఖరీదైన బహుమతులు ఇచ్చే సంస్కృతి పవన్ కు లేదని అదేవిధంగా ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ దర్శకుడుని తక్కువగా చూస్తూ పవన్ దూరం పెట్టడని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు త్రివిక్రమ్.

తరచూ తాము ఫోన్లో మాట్లాడుతూనే ఉంటామని, ఈ మధ్యే ఆయనకు ఫోన్‌ చేశానని గుర్తుచేశాడు. ఐనా, సినిమాల వల్ల ఫ్రెండ్‌షిప్ ఎందుకు బ్రేక్ అవుతుంది, అత్తారింటికి దారేది చిత్రం సమయంలో ఎలా వున్నామో, ఇప్పుడు అలానే ఉన్నామన్నాడు. ఐనా, పవన్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అస్సలు పట్టించుకోడని ఒక్క ముక్కలో తేల్చేశాడాయన.

ఇక ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ గురించి త్రివిక్రమ్ మొదటిసారిగా స్పందిస్తూ ఈమూవీ ఫెయిల్యూర్ కు తానే ప్రధానకారణం అని అంటూ ఈమూవీలో ఎమోషన్ దూరం అయిపోవడంతో పాటు కథలోనే ప్రధాన లోపం ఉండటంతో ఆసినిమా ఫెయిల్ అయిన విషయాన్ని వివరించాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని అతని ఇద్దరి కొడుకుల కార్పోరేట్ సామ్రాజ్యం నేపధ్యంలో తాను ‘అజ్ఞాతవాసి’ కోసం కథ రాయాలని ప్రయత్నించి ఆ పాయింట్ ను సరిగ్గా చెప్పలేకపోవడంతో తాను ఈసినిమా విషయంలో ఫెయిల్ అయిన విషయాన్ని అంగీకరిస్తున్నాను అంటూ తన ఓటమిని అంగీకరించాడు త్రివిక్రమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories