అమర్నాథ్‌ యాత్రలో అపశృతి

అమర్నాథ్‌ యాత్రలో అపశృతి
x
Highlights

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి దొర్లింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం అనే వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందారు....

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి దొర్లింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం అనే వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories