టాలీవుడ్‌ అగ్ర దర్శకులంతా ఒకేచోట...కారణం ఏంటంటే..

టాలీవుడ్‌ అగ్ర దర్శకులంతా ఒకేచోట...కారణం ఏంటంటే..
x
Highlights

నిత్యం కథా చర్చలు, షూటింగులతో బిజీగా ఉండే టాలీవుడ్ అగ్రదర్శకులంతా ఒకేచోట చేరారు. ఇందుకు వంశి పైడిపల్లి ఇల్లు వేదికైంది. ఓ కార్యక్రమం నిమిత్తం...

నిత్యం కథా చర్చలు, షూటింగులతో బిజీగా ఉండే టాలీవుడ్ అగ్రదర్శకులంతా ఒకేచోట చేరారు. ఇందుకు వంశి పైడిపల్లి ఇల్లు వేదికైంది. ఓ కార్యక్రమం నిమిత్తం దర్శకులు.. రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌లతోపాటు అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ వంగవీటి, ఇలా అంతా వంశి పైడిపల్లి ఇంటికి వచ్చారు. పార్టీ అనంతరం వీరంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు, 'అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను' అంటూ వంశీ వారందరికీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. ఇదిలావుంటే రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో ముల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారు. ఇక వంశీ పైడిపల్లి మహేష్‌ బాబు చిత్రంలో బిజీగా ఉన్నాడు. అనిల్‌ రావిపూడి ఎఫ్‌ 2 షూటింగ్‌కు సిద్ధం అయ్యాడు. సుకుమార్ ప్రస్తుతం మహేష్‌ కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. అలాగే కొరటాల, నాగ్ అశ్విన్, సందీప్, హరీష్ శంకర్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories