కేటీఆర్ ఆ మాట అనగానే నా మనసు చివుక్కుమంది: చిరంజీవి

కేటీఆర్ ఆ మాట అనగానే నా మనసు చివుక్కుమంది: చిరంజీవి
x
Highlights

ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పరిశ్రమ పెద్దలను తెలంగాణ ప్రభుత్వం తరపున...

ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పరిశ్రమ పెద్దలను తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన ఆలోచనకానీ, మన కల కానీ ఏ భాషలో అయితే ఉంటుందో అదే మాతృభాష అని తెలిపిన చిరు, ఈ మహాసభలను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుపుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రశంసించారు.

అనంతరం తెలుగు గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్ గారూ ఈ మహాసభలకు పిలిచేందుకు తమ ఇంటికి వచ్చారని.. అయితే ఆయనకు అవార్డు వచ్చిన సందర్భంగా ఆ సమయంలో ఇంగ్లీష్‌లో విష్ చేశానని తెలిపారు. అయితే వెంటనే ‘అన్నా.. మనం తెలుగు వాళ్లం. స్వచ్ఛమైన తెలుగు కార్యక్రమానికి పిలవడానికి వచ్చిన ఈ సందర్భంలో తెలుగులో మాట్లాడుకుంటే బావుంటుంది కదా..’’ అని అనగానే నాకు ఒక్కసారిగా చివుక్కుమనిపించింది. నిజమే కదా..! ఇద్దరు తెలుగు వాళ్లు ఎదురుపడినప్పుడు చక్కటి తెలుగు మాట్లాడకుండా.. ఆంగ్ల భాషని ఎందుకు వాడుతున్నాం అని అనిపించింది. వెంటనే ఆయనకి క్షమాపణ చెప్పేశాను. దానికి కేటీఆర్ ‘‘లేదన్నా.. జస్ట్ జోకింగ్’’ అని అన్నారని, ఆయన తమాషాగా అన్నా నాలో మాత్రం ఆ భావన కలిగిందని చిరంజీవి వివరించారు. తాను కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామందిని చూశానని, అధికారులు హిందీలో మాట్లాడుకుంటారని, తమిళులు తమిళంలో మాట్లాడుకుంటారని, ఇద్దరు తెలుగువారు కలిసినప్పుడు మాత్రం ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారని చిరంజీవి అన్నారు. ఇప్పటికైనా భేషజాలు వీడి తెలుగులో మాట్లాడి తెలుగును బతికించుకుందామని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories