విశాఖలో టీడీపీ వర్సెస్ వైసీపీ

విశాఖలో టీడీపీ వర్సెస్ వైసీపీ
x
Highlights

విశాఖలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చేపట్టిన ధర్మ పోరాట సభా ప్రాంగణాన్ని.. గంగాజలంతో శుద్ది...

విశాఖలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చేపట్టిన ధర్మ పోరాట సభా ప్రాంగణాన్ని.. గంగాజలంతో శుద్ది చేసేందుకు ప్రతిపక్ష వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్తున్న వైసీపీ నాయకులను.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు ఎంపీ విజయసాయిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆగ్రహించిన ప్రతిపక్ష కార్యకర్తలు.. హైవేపైనే బైఠాయించి.. నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories