బీజేపీకి ధైర్యం ఉంటే..

బీజేపీకి ధైర్యం ఉంటే..
x
Highlights

ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు మిత్ర ధర్మం అంటే ఏమిటో బీజేపీకి తెలుసా?...

ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు మిత్ర ధర్మం అంటే ఏమిటో బీజేపీకి తెలుసా? అంటూ సూటి ప్రశ్న సంధించారు. మిత్రధర్మాన్ని పాటించింది టీడీపీ ఒక్కటేనని రామ్మోహన్ స్పష్టం చేశారు.

అవిశ్వాసంపై చర్చకు కేంద్రం భయపడుతోందని విమర్శించారు. బీజేపీకి ధైర్యం ఉంటే అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలని ఎంపీ సవాల్ విసిరారు. టీడీపీ ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానంలేదని ఎంపీ అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలహీనపర్చాలని ప్రతిపక్ష నేతలు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీ హక్కుల సాధనలో జనసేన, వైసీపీ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories