బ్రేకింగ్: పళనిస్వామి సర్కారు సంచలన నిర్ణయం

బ్రేకింగ్: పళనిస్వామి సర్కారు సంచలన నిర్ణయం
x
Highlights

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం జరిగిన...

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కాలుష్యం ఏర్పడుతోందని స్థానికులు నెలల తరబడి ఆందోళన నిర్వహించారు. వారం రోజుల క్రితం జరిగిన ఆందోళనపై పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తమిళనాడు ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో స్టెరిలైట్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories