కాంగ్రెస్‌లో రెబెల్స్ తుపాన్ ...ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ, పరిస్ధితి ఉద్రిక్తం

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తొలి జాబితాలో చోటు దక్కని నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహాకూటమి పొత్తులో...

తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తొలి జాబితాలో చోటు దక్కని నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా మితప్రక్షాలకు కేటాయించిన స్ధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్‌ జిల్లా కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. వరంగల్ వెస్ట్ స్ధానాన్ని టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డికి మద్ధతుగా నిరసనకు దిగారు. 35 ఏళ్లుగా పార్టీని నమ్ముకుంటే ఇదేనా బహుమతి అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories