వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌పై దాడి

వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌పై దాడి
x
Highlights

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌కు దేశ రాజధాని నగరంలో చేదు అనుభవం ఎదురైంది. దీన్ దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంవైపు వెళ్తున్న స్వామిపై ...

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌కు దేశ రాజధాని నగరంలో చేదు అనుభవం ఎదురైంది. దీన్ దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంవైపు వెళ్తున్న స్వామిపై బీజేపీ కార్యకర్తలు సామూహికంగా దాడి చేశారు. ఈ విషయం గురించి అగ్నివేష్‌ మాట్లాడుతూ ‘వాజ్‌పేయి గారికి నివాళులర్పించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. కానీ పోలీసు బందోబస్తు ఉండటం వల్ల నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు. అంతేకాక ‘వారిలో కొందరు నన్ను ఉద్దేశిస్తూ అతను దేశద్రోహి.. కొట్టండి, కొట్టండి అంటూ నా మీద దాడికి పురిగొల్పార’ని అగ్నివేష్‌ తెలిపారు. అయితే అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories