ఆధార్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆధార్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
x
Highlights

ఆధార్ కార్డు చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మెజార్టీ న్యాయమూర్తులు ఆధార్‌ను సమర్ధించారు. ఆధార్ ఫార్ములాతో ఐదుగురు సభ్యుల...

ఆధార్ కార్డు చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మెజార్టీ న్యాయమూర్తులు ఆధార్‌ను సమర్ధించారు. ఆధార్ ఫార్ములాతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకీభవించింది. ఆధార్‌కు చట్టబద్ధత ఉందన్న ధర్మాసనం మెజారిటీ తీర్పును జస్టిస్ సిక్రీ చదవి వినిపించారు. ప్రజలకు ఒక విశిష్టమైన గుర్తింపు ఉండడం మేలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇతర ఐడీ కార్డుల కన్నా.. ఆధార్ భిన్నమైన గుర్తింపు కార్డు అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆధార్‌ను నకిలీ చేయలేరని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

అయితే రాష్ట్రాలు సహా ప్రైవేట్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు ఖరాఖండిగా చెప్పేసింది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్ కోసం బలవంతం చేయరాదని... స్కూళ్లు, ప్రయివేటు కంపెనీలు ఆధార్‌ కోసం ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక స్కూల్ అడ్మిషన్లు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. కానీ ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి, పాన్‌ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పకుండా ఉండాలని కోర్టు వెల్లడించింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4 : 1మెజార్టీతో తీర్పు ఇచ్చింది. ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు ఆధార్‌ను సమర్ధించారు. ఆధార్ తీర్పును చదివిన జస్టిస్ ఏకే సిక్రీ... ఆధార్‌ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని అన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్‌ సేవలను తీసుకొచ్చారని, డూప్లికేట్‌ ఆధార్‌ తీసుకోవడం అసాధ్యమని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్‌ ఒక గుర్తింపని చెప్పారు. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సూచించింది.

ప్రాథమిక హక్కులైన గోపత్య, వ్యక్తిగత వివరాలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషన్ర్ల వాదనతో సుప్రీం విభేదించింది. ఆధార్ కార్డు కోసం ప్రభుత్వం కేవలం కొన్ని ప్రాధమికమైన ఆధారాలను మాత్రమే సేకరిస్తుందనీ... ఒకరికి కేటాయించిన ఆధార్ సంఖ్య మరెవరికీ ఉండదని సుప్రీం తెలిపింది. ఆధార్ కార్డుకు, గుర్తింపునకు తేడా ఉందనీ.. ఒక్కసారి ప్రజల నుంచి బయోమెట్రిక్ డేటా సేకరిస్తే అది సిస్టమ్‌లో స్టోర్ అయి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పటిష్టమైన డేటా భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories