సుప్రీం వార్నింగ్....వదంతులు, పుకార్లతో జనాన్ని కొట్టి చంపడమేంటి?

x
Highlights

గో సంరక్షణ పేరుతోనో, వాట్సాప్‌ వదంతులతోనో, జనాలపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు వార్నింగ్‌ ఇచ్చింది...అవును. గో సంరక్షణ పేరుతో...

గో సంరక్షణ పేరుతోనో, వాట్సాప్‌ వదంతులతోనో, జనాలపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు వార్నింగ్‌ ఇచ్చింది...అవును. గో సంరక్షణ పేరుతో బడుగులపై దాడి చేేసేవారి తాటతీయాలని సుప్రీంకోర్టు స్పష్టాతిస్పష్టంగా ఆదేశాలిచ్చింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వదంతులతో జనాన్ని కొట్టి, చంపేస్తున్న మూకలు కటకటాలు లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అతి త్వరలో పార్లమెంటులో చట్టం చేయాలని స్పష్టం చేసింది.

సెప్టెంబర్‌ 28, 2015...దాద్రీ,, యూపీ..గో మాంసం తిన్నాడన్న వదంతులతో ముస్లింపై దాడి...జులై 20, 2016...ఉనా, గుజరాత్...గోవును వధించారని...ఏడుగురు దళితులపై దాడి,...జులై, 2018...బీదర్‌, కర్ణాటక..పిల్లలను ఎత్తుకుపోయేవారన్న వదంతులతో ఒకరి హత్య....ఇలా చెప్పుకుంటూపోతే, గో సంరక్షణ పేరుతో కొన్ని సంస్థలు దళితులు, ముస్లింలపై దాడులకు తెగబడిన ఘటనలు కోకొల్లలు. అలాగే కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా వాట్సాప్‌ వదంతుల కారణంగా, అమాయకులను కొందరు కుళ్లబొడిచేస్తున్నారు. పిల్లలను ఎత్తుకుపోయేవారని, చంపేసి, అవయవాలు తినేవారన్న పుకార్లతో ముందూ వెనకా ఆలోచించకుండా కొట్టేస్తున్నారు.ఇలా వ్యక్తులపై చేసే మూకుమ్మడి దాడులను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని శిక్షించడానికి ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

వదంతులు, పుకార్లు, గో సంరక్షణ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, మూకుమ్మడి దాడులకు పాల్పడే మూకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, సామాజిక కార్యకర్త తెహసీన్‌ పూనావాలా, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. భయం, అరాచకత్వం వంటి ఘటనల్లో రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాలి. హింసను అనుమతించకూడదు. రక్షణ పేరుతో గుంపుగా దాడి చేయడం ఎంతమాత్రం సరికాదు. వీటిని అరికట్టడం రాష్ట్రాల బాధ్యత. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్‌ ఓ ప్రత్యేక చట్టాన్ని తయారుచేయాలని స్పష్టం చేసింది కోర్టు.

మరోసారి నిందితులు వ్యక్తిగత దాడులకు పాల్పడని విధంగా చట్టంలో కఠిన నిబంధనలను చేర్చాలని న్యాయస్థానం తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేసింది కోర్టు. సుప్రీం కోర్టు ఆదేశాలపై, అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మరి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో, ఈ చట్టాన్ని తెస్తారా లేదా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories