టీచర్‌పై విద్యార్ధి దాడి.

టీచర్‌పై విద్యార్ధి దాడి.
x
Highlights

పాఠశాలకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించినందుకు ఓ విద్యార్థి ఏకంగా టీచర్ పైనే దాడికి దిగాడు.ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. సాకేత్‌ ప్రాంతంలో నివాసముండే గర్హేల్‌...

పాఠశాలకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించినందుకు ఓ విద్యార్థి ఏకంగా టీచర్ పైనే దాడికి దిగాడు.ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. సాకేత్‌ ప్రాంతంలో నివాసముండే గర్హేల్‌ కుమారుడు వీర్‌ చందర్‌ సింగ్‌ గర్హేల్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే అతడు గత కొద్ది రోజులుగా స్కూల్‌కు హాజరు కావడం లేదు. వచ్చినా పుస్తకాలు తేవడం లేదు. దాంతో ఉపాధ్యాయుడు శ్యామ్‌ సుందర్‌ చౌధరి విద్యార్థిని మందలించారు. విద్యార్థి బ్యాగ్‌ను పరిశీలించిన శ్యామ్‌ సుందర్‌కు అందులో ఇనుప రాడ్‌ కనిపించడంతో తీవ్రంగా మందలించి తన టేబుల్‌పై దాన్ని ఉంచారు.

మరోసారి ఇనుప కడ్డీని విద్యార్థి తన బ్యాగ్‌లో వేసుకోవడంతో ఆగ్రహించిన టీచర్‌ దాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా, విద్యార్థి ఇనుప రాడ్‌తో దాడికి తెగబడ్డాడు. విద్యార్థి దాడితో టీచర్‌ కన్ను, చెవు, తలపై గాయాలయ్యాయి. దాడి అనంతరం స్కూల్‌ ప్రహరీ గోడను దూకి నిందితుడు పారిపోయాడు. కాగా ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories