చిత్తుగా ఓడిన భారత్.. 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఘనవిజయం

Highlights

ధర్మశాల వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ కొట్టింది. 20.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు లంక...

ధర్మశాల వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ కొట్టింది. 20.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు లంక బ్యాట్స్‌మెన్లు. దీంతో 3 వన్డేల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మెన్లకు లంక బౌలర్లు చుక్కలు చూపించారు. అక్మల్ ఒక్కడే.. 4 వికెట్లు తీశాడు. దీంతో భారత్ 112 పరుగులకే ఆలౌటైంది. ఆఖర్లో ధోనీ పోరాటంతో.. భారత్ స్కోరు వంద దాటింది.

Show Full Article
Print Article
Next Story
More Stories