యాదాద్రిలో బూజుపట్టిన లడ్డూలు

x
Highlights

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బూజుపట్టిన లడ్డూ ప్రసాదలు దర్శనమిచ్చాయి. భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన 3వేల లడ్డూలు బూజు పట్టడంతో...

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బూజుపట్టిన లడ్డూ ప్రసాదలు దర్శనమిచ్చాయి. భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన 3వేల లడ్డూలు బూజు పట్టడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పడేశారు. నిన్న భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో లడ్డూ తయారీదారులు నెయ్యి తక్కువగా ఉపయోగించి, నీటిని ఎక్కువగా వాడటంతో ఒక్కరోజుకే పాడైపోయాయి. లడ్డూ తయారీ కేంద్రంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అభిషేకం లడ్డూ విక్రయాలు చేసే రూంలో సరైన గాలి , వెలుతురు సౌకర్యాలు లేకపోవడంతో లడ్డూలు పాడైపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories