ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
x
Highlights

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో ... కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని గుర్తుతెలియని...

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో ... కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 21 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories