జనం మీద దూసుకెళ్లినకారు…ఏడుగురు మృతి

జనం మీద దూసుకెళ్లినకారు…ఏడుగురు మృతి
x
Highlights

తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుందరాపురం సమీపంలో ఒక కారు వేగంగా వచ్చి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ...

తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుందరాపురం సమీపంలో ఒక కారు వేగంగా వచ్చి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు కళాశాల విద్యార్థులు ఉన్నారు. మరో ఏడుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు జనంపైకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories