ఐపీఎల్ -11లో వాట్సన్ అరుదైన రికార్డులు

ఐపీఎల్ -11లో వాట్సన్ అరుదైన రికార్డులు
x
Highlights

ఐపీఎల్ 11వ సీజన్ టోర్నీలో....విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా హైదరాబాద్...

ఐపీఎల్ 11వ సీజన్ టోర్నీలో....విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన ఫైనల్లో అన్ బీటెన్ సెంచరీతో...ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు అందుకొన్న వాట్సన్...ప్రస్తుత 2018 సీజన్లో రెండు సెంచరీలు సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు...తన కెరియర్ ఐపీఎల్ శతకాల సంఖ్యను నాలుగుకు పెంచుకొన్నాడు. 36 ఏళ్ల వాట్సన్....ప్రస్తుత సీజన్ లీగ్ దశలో ఓ సెంచరీ, ఫైనల్లో ఓ సెంచరీతో పాటు...మొత్తం 555 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 11లో 400కు పైగా పరుగులు సాధించిన నలుగురు చెన్నై ఆటగాళ్లలో....వాట్సన్ కూడా ఒకడు కావటం మరో విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories