అల్ల‌రి న‌రేష్ చిత్రానికి సీక్వెల్‌

అల్ల‌రి న‌రేష్ చిత్రానికి సీక్వెల్‌
x
Highlights

'జంప్ జిలానీ' పేరుతో 2014లో 'అల్ల‌రి' న‌రేష్ హీరోగా ఓ సినిమా వ‌చ్చిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. న‌రేష్ ద్విపాత్రాభిన‌యం చేసిన ఆ సినిమా ఇక్క‌డ...

'జంప్ జిలానీ' పేరుతో 2014లో 'అల్ల‌రి' న‌రేష్ హీరోగా ఓ సినిమా వ‌చ్చిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. న‌రేష్ ద్విపాత్రాభిన‌యం చేసిన ఆ సినిమా ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాలేదు కానీ.. ఆ సినిమాకి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ అయిన 'క‌ల‌గ‌ల‌ప్పు' త‌మిళ‌నాట మంచి విజ‌యం సాధించింది.

తెలుగమ్మాయి అంజ‌లితో పాటు విమ‌ల్‌, మిర్చి శివ‌, ఓవియా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి కుష్బూ భ‌ర్త సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2012లో విడుద‌లైన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొంద‌నుంది. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో జీవా, జై, కేథ‌రిన్ ట్రెసా, నిక్కీ గ‌ల్రాణి న‌టించ‌నున్నారు. సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories