ఎస్ బీఐ క‌ష్ట‌మ‌ర్ల‌కు న్యూ ఇయ‌ర్ ఆఫర్

ఎస్ బీఐ క‌ష్ట‌మ‌ర్ల‌కు న్యూ ఇయ‌ర్ ఆఫర్
x
Highlights

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఎస్ బీఐ త‌న క‌ష్ట‌మ‌ర్లకు శుభ‌వార్త అందించింది. క‌ష్ట‌మ‌ర్లు అందించే వడ్డీరేటును 30బేస్ పాయింట్ల‌కు త‌గ్గించింది. గ‌తంలో...

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఎస్ బీఐ త‌న క‌ష్ట‌మ‌ర్లకు శుభ‌వార్త అందించింది. క‌ష్ట‌మ‌ర్లు అందించే వడ్డీరేటును 30బేస్ పాయింట్ల‌కు త‌గ్గించింది. గ‌తంలో వ‌డ్డిరేట్లు 8.95శాతం ఉంటే ఇప్పుడు వడ్డీరేటు 8.65 శాతానికి తగ్గింది. ఈ వ‌డ్డీరేట్లు 2018 జనవరి 1 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో హోం లోన్ , ఎడ్యుకేష‌న్ లోన్ తీసుకున్న‌వారికి ఊర‌ట‌ల‌భించింది. ఈ త‌గ్గించిన వ‌డ్డీరేట్లు 2016 ఏప్రిల్‌కు ముందు బేస్‌ రేట్‌ ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. చివరి సారిగా గతేడాది సెప్టెంబర్‌లో 9 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.95 శాతానికి తగ్గించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories