సందీప్ నాలుగు నెల‌లు కంటిన్యూ చేస్తున్నాడు

సందీప్ నాలుగు నెల‌లు కంటిన్యూ చేస్తున్నాడు
x
Highlights

తొలి చిత్రం 'ప్ర‌స్థానం' నుంచి డిఫ‌రెంట్ రోల్స్ చేయ‌డంపైనే దృష్టి పెడుతున్నాడు యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్‌. కెరీర్‌లో 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్'...

తొలి చిత్రం 'ప్ర‌స్థానం' నుంచి డిఫ‌రెంట్ రోల్స్ చేయ‌డంపైనే దృష్టి పెడుతున్నాడు యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్‌. కెరీర్‌లో 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్' మిన‌హాయిస్తే చెప్పుకోద‌గ్గ విజ‌యమేదీ లేదు సందీప్‌కి. అయితేనేం.. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. ఇక ఈ ఏడాది అయితే జూలై నుంచి నెల‌కో సినిమాతో నాలుగు నెల‌ల పాటు ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

జూలైలో 'శ‌మంత‌క‌మ‌ణి'తో ప‌ల‌కరించిన సందీప్‌.. ఆగ‌స్టులో 'న‌క్ష‌త్రం'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఇక సెప్టెంబ‌ర్‌లో 'ప్రాజెక్ట్ z'తో సంద‌డి చేయ‌నున్నాడు. అలాగే అక్టోబ‌ర్‌లో 'కేరాఫ్ సూర్య'తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో నాలుగు నెల‌ల‌పాటు కంటిన్యూగా సినిమాల‌తో ప‌ల‌క‌రించిన క‌థానాయ‌కుడు బ‌హుశా సందీప్ నే కావ‌చ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories