రెజీనాకు నాకు పెళ్లైంది..ఇద్దరు ఆడపిల్లలు : సాయిధరమ్ తేజ్

Highlights

ప్రేమ పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ దారిలోనే ఆయన ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నడుస్తున్నాడు అంటూ వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కొద్దికాలం...

ప్రేమ పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ దారిలోనే ఆయన ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నడుస్తున్నాడు అంటూ వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కొద్దికాలం క్రితం సాయి ధరమ్ తేజ్ రెజీనాల మధ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ అప్పట్లో మీడియాను వార్తలతో కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే స్టోరీ రైటర్ కమ్ డైరక్టర్ బీవీఎస్ రవి - సాయిధరమ్ తేజల కాంబినేషన్ లో జవాన్ అనే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ సినిమా గురించి, తనకు, రెజీనా గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించాడు.
జవాన్ సినిమా విడుదల సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ తనకి - రెజీనా గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై మండిపడ్డారు. మీకు రెజీనాకు పెళ్లైందన్న ప్రశ్నపై స్పందించిన సాయి ధరమ్ అవును నాకు రెజీనాకు పెళ్లైంది. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు స్కూల్ కి కూడా వెళుతున్నారు. ఒక పాప రెండో తరగతి, మరోపాప ఆరోతరగతి చదువుతోంది. అంతేకాదు తనకు రెజీనా, రకుల్ తో సంబంధాలున్నాయట. తాను ఏ హీరోయిన్ తో సినిమా చేస్తే ఆ హీరోయిన్ తో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆవేధన వ్యక్తం చేశారు. తన గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా పట్టించుకోవడంలేదని ..ఆడపిల్లల గురించి రూమర్స్ రాయడం తనకు చాలా బాధగా ఉందని తెలిపారు. ఆ రూమర్స్ వల్ల రాసేవారు, చదివేవారు బాగుంటారే తప్పా హీరోయిన్ల కెరియర్ దెబ్బతింటుందని అలాంటి రూమర్స్ రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుండేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories