ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ

ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉంచిన బంగారు, వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా...

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉంచిన బంగారు, వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎమ్మెల్యే రోజా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదుతో మాదాపూర్ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బీరువాలో పెట్టిన విలువైన హారం ఎలా అపహరణకు గురైందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. పనివాళ్లే ఎవరైనా తీశారా? లేక బయటివాళ్లు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories