బీజేపీకి ఊహించని షాక్.. ఎన్డీయేకి కేంద్రమంత్రి గుడ్‌బై!

బీజేపీకి ఊహించని షాక్.. ఎన్డీయేకి కేంద్రమంత్రి గుడ్‌బై!
x
Highlights

పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇవాళ ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)...

పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇవాళ ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పేశారు. కుష్వాహా తన రాజీనామా లేఖను ప్రధానమం‍త్రి కార్యాలయానికి (పీఎంఓ) ఆమోదం కొరకు పంపినట్టు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ సీట్ల సర్ధుబాటు ప్రతిపాదనలతో పాటు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ వైఖరితో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆర్ఎల్ఎస్పీకి మూడు స్థానాలు ఇవ్వగా, మూడింటా విజయం సాధించిన తమ పార్టీకి వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో 7 సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, బీజేపీ, జేడీయూలు మాత్రం రెండు సీట్లను మాత్రమే కుష్వాహ టీమ్ కు ఇస్తామని కరాఖండీగా చెప్పేశాయి. దీనిపై గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్న కుష్వాహ, కూటమిలో తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడంలేదని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories