ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే

ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే
x
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు...

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు నియోజకవర్గ కేంద్రంలోని బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయ సీతక్కను భారీ మెజారటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కేసీఆర్ ములుగు నియోజక వర్గంలో చందులాల్ తన కుమారుడు ప్రహ్లాద్ అవినీతి పరిపాలన కొనసాగిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికుటుంబాలకు టీఆర్ఎస్ ఏమేరకు న్యాయం చేసిందని ఆయన ప్రశ్నించారు. ములుగులో సాటి గిరిజనుల ఇళ్లు కూల్చి వారు రోడ్డుపాలైతే రాక్షసానందాన్ని పొందిన వ్యక్తి మంత్రి చందూలాల్‌ అని ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories