ముంబై దారుణానికి కారణాలు ఇవే!

ముంబై దారుణానికి కారణాలు ఇవే!
x
Highlights

మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యం... ముంబై కమలా మిల్స్ కాంపౌండ్ లో జరిగిన విషాదంలో మృతుల సంఖ్య పెరగడానికి అసలు కారణమని అధికారులు చెబుతున్నారు ఈ విషాదం వెనుక...

మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యం... ముంబై కమలా మిల్స్ కాంపౌండ్ లో జరిగిన విషాదంలో మృతుల సంఖ్య పెరగడానికి అసలు కారణమని అధికారులు చెబుతున్నారు ఈ విషాదం వెనుక ఉన్న అసలు కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి మంటలు వ్యాపించే సమయానికి మత్తులో జోగుతున్న వారంతా వెంటనే స్పందించలేకపోయారని సృహలో ఉన్నవారు ఇరుకుగా ఉన్న గుమ్మం నుంచి బయటపడి మంటలతో సెల్ఫీలు దిగడంలో మునిగిపోవడంతో అక్కడ జనాలు పోగయ్యారు.

ఫలితంగా బయటకు వచ్చే వారికి దారి దొరకలేదు మరోవైపు క్షణాల్లో వ్యాపించిన మంటలు అక్కడున్న వారిని చుట్టుముట్టేశాయి. ఇక ప్రమాదం సమయంలో కస్టమర్లను కాపాడాల్సిన పబ్ సిబ్బంది ఏమీ పట్టనట్టు పారిపోయి వారి ప్రాణాలను రక్షించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

పుట్టిన రోజు పార్టీ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చిన ఖుష్బూ బన్సాలీ బర్త్ డే కేక్ కట్ చేసిన కాసేపటికే మృతి చెందింది. వెదురు కర్రలతో నిర్మించిన టెర్రస్ కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. మంటల నుంచి రక్షించుకునేందుకు వాష్ రూమ్‌లో దూరిన 15 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన సమయంలో పబ్‌లో 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories