పైసా తగ్గింపుపై ఫైర్‌..

పైసా తగ్గింపుపై ఫైర్‌..
x
Highlights

పెట్రోలు ధర లీటరుపై ఒక్క పైసా తగ్గించడంమీద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీని తన ట్విటర్ లో దుయ్యబట్టారు. ప్రజలతో మీరు...

పెట్రోలు ధర లీటరుపై ఒక్క పైసా తగ్గించడంమీద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీని తన ట్విటర్ లో దుయ్యబట్టారు. ప్రజలతో మీరు చెలగాటమాడుతున్నారని, ఒక్క పైసా తగ్గించడం తనను షాక్ కి గురి చేసిందని అన్నారు. ఇదే మీరు చేస్తున్న తమాషా అయితే..ఇది నిజంగా పిల్ల చేష్ట.. అధ్వాన్నమైన , పరిణతి లేని చర్య అని ఆయన ఫైర్ అయ్యారు. ఫ్యుయెల్ ఛాలెంజ్ అంటూ తను గతవారం విసిరిన సవాలుకు ఇది సరైన స్పందన కాదని రాహుల్ పేర్కొన్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్టు మోదీ ప్రకటించడం, ఆ తరువాత, దమ్ముంటే మీరు ఫ్యుయెల్ (పెట్రోలు) ధరలను తగ్గించండి అంటూ రాహుల్..మోదీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories