హాస్య‌న‌టుడు విజ‌య్ మృతి ఘటనలో కీలక మలుపు..!

Highlights

టాలీవుడ్ హాస్య‌న‌టుడు విజ‌య్ హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడలోని త‌న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ ఘటనలో కొద్దిసేపటి...

టాలీవుడ్ హాస్య‌న‌టుడు విజ‌య్ హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడలోని త‌న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ ఘటనలో కొద్దిసేపటి క్రితం కీలక సంఘటన చోటు చేసుకుంది.. విజ‌య్ తండ్రి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు జూబ్లిహిల్స్ పోలీసులు విజ‌య్ భార్య వ‌నిత‌పై కేసు న‌మోదు చేశారు. అలాగే న్యాయ‌వాది శ్రీనివాస్‌, శ‌శిధ‌ర్‌పై కూడా కేసు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ... విజ‌య్‌తో విడిపోయిన వ‌నిత త‌న కుమారుడిని త‌రుచూ డ‌బ్బు డిమాండ్ చేసేద‌ని తెలిపారు. వ‌నిత త‌ర‌పు అడ్వ‌కేట్ విజ‌య్ ప‌లుసార్లు ఈ విష‌య‌మై ఇంటికి వ‌చ్చేవాడ‌ని అయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories