‘అజ్ఞాతవాసి’తరువాత పవన్ నెక్ట్స్ సినిమా ఇదే

Highlights

పవన్ కల్యాణ్ 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ తో పవన్ కల్యాణ్ అభిమానులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు పవన్ ను...

పవన్ కల్యాణ్ 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ తో పవన్ కల్యాణ్ అభిమానులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు పవన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా తరువాత పవన్ ఏం చేస్తారు..? ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినిమాలా..? పాలిటిక్సా అంటూ అభిమానులు గందరగోళంలో పడ్డారు. అయితే ఈ గందరగోళాన్ని తెరదించుతూ ఏఏం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ షాకిచ్చారు. ప్రస్తుతం తాను గోపిచంద్ తో తీసిన ఆక్సిజన్ ప్రమోషన్ లో ఉన్న జ్యోతి కృష్ణ..,పవన్ అజ్ఞాతవాసి తరువాత ఏం సినిమా చేస్తున్నారో చెప్పకనే చెప్పాడు.

తమిళంలో రికార్డ్ లు సృష్టించిన అజిత్ వేదాళం సినిమా కాటమరాయుడు తరువాత రిమేక్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని అన్వేక కారణాలవల్ల త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి ప్రారంభమైంది. దీంతో వేదాళం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ పవన్ 25వ సినిమా తరువాత ఎన్నికలకు సిద్ధమవుతారనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి సినిమా తరువాత నేసన్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌ షూటింగ్‌ జనవరి 2018 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. మరి జ్యోతికృష్ణ చెప్పినట్లు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా? లేక పవన్‌ గతంలో చెప్పినట్లే 2019 ఎన్నికల కోసం తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారా? అనేది తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories