పెళ్లి గిఫ్ట్‌లో బాంబు.. వరుడు మృతి

పెళ్లి గిఫ్ట్‌లో బాంబు.. వరుడు మృతి
x
Highlights

పచ్చటి పెళ్లి పందిట్లో ఘోరం... తోరణాలు వాడకముందే దుండగులు ఓ కుటుంబంలో తీరని శోకం మిగిల్చారు... పెళ్లి కానుక మాటున బాంబును పార్సిల్ చేసి ఘాతుకానికి...

పచ్చటి పెళ్లి పందిట్లో ఘోరం... తోరణాలు వాడకముందే దుండగులు ఓ కుటుంబంలో తీరని శోకం మిగిల్చారు... పెళ్లి కానుక మాటున బాంబును పార్సిల్ చేసి ఘాతుకానికి తెగబడ్డారు. ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలో శుక్రవారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని పట్నాఘర్ గ్రామంలో సౌమ్య శేఖర్ సాహు, రీమా సాహులకు ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. ఈ నెల 21న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందుకు వచ్చిన ఓ వ్యక్తి.. ఆ నూతన జంటకు బహుమతిగా బాంబు ఇచ్చాడు. అయితే దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత విప్పితే పేలిపోయింది. ఈ ప్రమాదంలో నూతన వధూవరులతో పాటు వరుడి నానమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వరుడు, నానమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వధువు చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories