రెండో జాబితాలోనూ పొన్నాలకు దక్కని చోటు...

రెండో జాబితాలోనూ పొన్నాలకు దక్కని చోటు...
x
Highlights

మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ మరోసారి మొండి చేయి చూపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను...

మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ మరోసారి మొండి చేయి చూపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో ఆయనతో పాటు అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌.. 10 మందితో రెండో జాబితా విడుదల చేసింది. వివాదాలు, అసంతృప్తులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో పది మందితో రెండో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ ఇవాళ విడుదల చేసిన రెండో జాబితాలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, రెండు బీసీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులకు సీట్లు ఖారారు చేయగా, ఆరు స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.

Show Full Article
Print Article
Next Story
More Stories