ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వేశాఖ...!  

ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వేశాఖ...!  
x
Highlights

ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సాహించేందుకు ఐఆర్ సీటీసీ ద్వారా రైల్వేశాఖ 2017, డిసెంబరు నుంచి ఉచిత బీమాను తీసుకొచ్చింది. రైలు ప్రమాదాల్లో ఒక వ్యక్తి...

ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సాహించేందుకు ఐఆర్ సీటీసీ ద్వారా రైల్వేశాఖ 2017, డిసెంబరు నుంచి ఉచిత బీమాను తీసుకొచ్చింది. రైలు ప్రమాదాల్లో ఒక వ్యక్తి మరణించినప్పుడు గరిష్టంగా రూ.10 లక్షలు, దివ్యాంగుడైతే.. రూ.7.5 లక్షలు, గాయపడితే.. రూ. 2 లక్షలు అందిస్తోంది రైల్వే శాఖ. అలాగే మృతదేహాలను తరలించేందుకు రూ. 10వేలు కూడా అందిస్తుంది.

అయితే ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికులకు షాకిచ్చింది... ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు చేసింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఉచిత బీమాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం చేపట్టిన ఉచిత బీమా సౌకర్యాన్ని త్వరలో నిలిపివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

ప్రయాణీకులకు ఉచితంగా ప్రయాణ బీమాను నిలిపివేయనుందనీ, "బీమా ఐచ్ఛికం" అని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రైల్వే ప్రయాణికులు వెబ్ సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటే ఇన్సూరెన్స్‌ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అయితే ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం స్పష్టం చేయలేదు.

ఇది ఇలా ఉంటే... ఉచిత బీమా సౌకర్యం వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీమా కంపెనీల నుంచి రూ. 3.5 కోట్లు పంపిణీ చేసినట్టు ఇటీవల రైల్వే శాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories