కేసీఆర్ లండన్ వెళ్ళి... వచ్చే ఐదేళ్ళు అక్కడే ఉండాలి : మోడీ

కేసీఆర్ లండన్ వెళ్ళి... వచ్చే ఐదేళ్ళు అక్కడే ఉండాలి : మోడీ
x
Highlights

నిజామాబా‌ద్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని మోడీ ప్రశ్నించారు. కేసీఆర్ హామీ ఎంతవరకు నిజమైందోనని హెలీకాఫ్టర్‌ నుంచి గమనిస్తే నిజామాబాద్ లో...

నిజామాబా‌ద్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని మోడీ ప్రశ్నించారు. కేసీఆర్ హామీ ఎంతవరకు నిజమైందోనని హెలీకాఫ్టర్‌ నుంచి గమనిస్తే నిజామాబాద్ లో కరెంటు, నీరు, రోడ్ల సమస్యలు అలానే ఉన్నట్లు తేలిందని మోడీ చెప్పారు. అసలు లండన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కేసీఆర్ ఇంగ్లండ్ వెళ్ళి... వచ్చే ఐదేళ్ళు అక్కడే గడపాలని సెటైర్ వేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పాలన కాంగ్రెస్ తరహాలోనే అభివృద్ధి రహితంగా సాగుతోందని మోడీ అన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లుగానే తామూ తెలంగాణలో అధికారం చెలాయించాలని కేసీఆర్ కుటుంబం భావిస్తోందని అయితే అభివృద్ధిని పట్టించుకోని వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని మోడీ అన్నారు. మరోసారి ఎన్నికల్లో గెలవాలన్న కేసీఆర్ ఆశలు నెరవేరవని మోడీ జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories