అనూష కేసులో వీడిన మిస్టరీ

అనూష కేసులో వీడిన మిస్టరీ
x
Highlights

హైదరాబాద్‌ నగరంలో సంచలం సృష్టించిన అనూష హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు మోతిలాలే హత్య చేశాడని నిర్ధారించారు. ఆధారాలతో సహా నిందితుడిని...

హైదరాబాద్‌ నగరంలో సంచలం సృష్టించిన అనూష హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు మోతిలాలే హత్య చేశాడని నిర్ధారించారు. ఆధారాలతో సహా నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా సర్వారెడ్డిపల్లి తండా నివాసి మోతీలాల్ ఓ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతనికి నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూషతో ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో 9 నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది.

కొంతకాలంగా అనూష దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు సంస్థలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతోంది. అనూష తాను 2013 నుంచి ప్రేమించుకున్నాం అని ఆమెను హత్య చేసిన ప్రియుడు మోతీలాల్‌ చెప్పాడు. తమ ప్రేమ వ్యహారంపై తమ ఇంట్లో ఒప్పకోక పోయినా అనూష ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నామని తెలిపాడు. అనూష చదువుకు అయ్యే ఖర్చు కూడా తానే భరించానని, కానీ, ఆమె ప్రవర్తనలో గత కొద్ది రోజుల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పాడు. అనూష ఫోన్ పరిశీలిస్తే చాలామందితో చాటింగ్ చేసినట్లు గుర్తించానని, తన స్నేహితుడు కూడా అనూషతో చాటింగ్ చేయడంతో తనకు అనుమానం ఎక్కువైందన్నాడు. ఈ వ్యవహారంపై అనూషను నిలదీయడంతోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, తాగిన మైకంలో క్షణికావేశంతో అనూషను బండ రాయితో మోది హత్య చేశానని అంగీకరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories