విశాఖపై కీలక నిర్ణయం తీసుకున్న ధోని

విశాఖపై కీలక నిర్ణయం తీసుకున్న ధోని
x
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీకి విశాఖతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన...

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీకి విశాఖతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ ధోనీ విశాఖ వైయస్ రాజేశేఖర్ రెడ్డి స్టేడియంలోనే ఆడాడు. 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహి సెంచరీతో చెలరేగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత ధోనీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. తాజాగా విశాఖతో ధోని తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నాడు. విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. ఇప్పటికే అకాడమీకి సంబంధించి ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాస్, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఎండి మిహిర్ దివాకర్ సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను నిర్మించనున్నారు. రెండు దశల్లో ఈ అకాడమీ నిర్మాణం పూర్తి చేయనున్నట్టు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. కాగా ధోనీ నిర్ణయంతో విశాఖలోని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories