వారిపట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ

వారిపట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ
x
Highlights

కాంగ్రెస్ నాయకుల గల్ఫ్ యాత్రపై ఎంపీ కవిత మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ఇప్పటివరకూ గుర్తుకు రాని గల్ఫ్...

కాంగ్రెస్ నాయకుల గల్ఫ్ యాత్రపై ఎంపీ కవిత మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ఇప్పటివరకూ గుర్తుకు రాని గల్ఫ్ కార్మికుల పట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ఎంపీ కవిత ప్రశ్నించారు. గల్ఫ్ వలసలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టేనన్నారు. కాంగ్రెస్ హయాంలో చిల్లగవ్వ విడుదల చేయకుండా NRI సెల్ నడిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతున్నాన్నరు. గడిచిన నాలుగేళ్లలో గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం 106 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గల్ఫ్‌లో ఈ నాలుగేళ్లలో 1278 మంది చనిపోతే అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి స్వస్థలాలకు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ చర్యలతో వలసలకు అడ్డుకట్ట వేసినమని.. సొంత గ్రామాల్లోనే ఉపాధి చర్యలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories