టీడీపీ,బీజేపీ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం

టీడీపీ,బీజేపీ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
x
Highlights

ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.. బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతుండటంతో టీడీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌...

ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.. బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతుండటంతో టీడీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌ చేస్తోంది.

ఏపీలో భారీఎత్తున అవినీతి జరుగుతోందంటూ బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి పీడీ ఖాతాల రూపంలో చంద్రబాబు ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుందని.. వీటన్నికి లెక్కలు చెప్పాల్సిందిగా ఎంపీ జీవీఎల్‌ ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆయనకు మద్దతుగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీపై ఎటాక్ చేస్తున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జన్మభూమి పేరుతో రాష్ట్ర ప్రజల సంపదను కార్యకర్తలకు పంచుతున్నారంటూ తీవ్రస్థాయిలో అయన ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంపీ జీవీఎల్ ఆరోపణలపై టీడీపీ కూడా విరుచుకు పడుతోంది. దమ్ముంటే అవినీతి నిరూపించాలంటూ సవాల్‌ విసురుతున్నారు టీడీపీ నేతలు. కేంద్రం కావాలనే చంద్రబాబుపై జీవీఎల్‌ను ఉసిగొల్పుతోందని మండిపడుతున్నారు. జీవీఎల్‌వి ఊహాజనిత ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు…పైగా పీడీ అకౌంట్‌ అంటే ఏంటో జీవీఎల్‌కు తెలుసా అని జీవీఎల్ కు చురకలంటించారు. అయితే ఎంపీ జీవీఎల్ మాత్రం అంతేస్థాయిలో కుటుంబరావుపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తాను లెక్కలు మాత్రమే అడిగానని.. అవి తేల్చకుండా షేర్ మార్కెట్ల బ్రోకర్ తో విమర్శలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఇటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా జీవీఎల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. నరేంద్రమోడీకి జగన్, పవన్, జీవీఎల్ ముగ్గురు తొత్తులని విమర్శించారు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..ఆ ముగ్గురు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories